మెహిదీపట్నం : నవంబర్ 15 న వరంగల్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. విజయగర్జన సభ సన్నాహకం కోసం లంగర్హౌస్లో కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సమావేశం నియోజకవర్గం ఇంఛార్జి ఠాకూర్ జీవన్సింగ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్విరామంగా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని, పాతబస్తీకి చెందిన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పార్టీలో సముచితస్థానం లభిస్తుందని అన్నారు.
పార్టీ కోసం పనిచేస్తున్న వారిని అధిష్టానం తప్పక గుర్తిస్తుందని పేర్కొన్నారు. విజయగర్జన కార్యక్రమం విజయవంతం చేయడానికి కార్వాన్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఠాకూర్ జీవన్ సింగ్తో పాటు భూపతిరెడ్డి, మిత్ర కృష్ణ,కావూరివెంకటేష్, శేఖర్ రెడ్డి, నర్సింహాగౌడ్, చంద్రకాంత్, కోడూరి శ్రీధర్ సాగర్, ముత్యాల భాస్కర్, కోయల్కార్ గోవింద్రాజ్, బంగారి ప్రకాష్ పాల్గొన్నారు.