మన్ననూర్, డిసెంబర్ 8 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మం డలం దోమలపెంట రేంజ్ పరిధిలో మల్లెలతీర్థం సమీపంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి దగ్గరలో చిరుతపులిని దాహనం చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎఫ్వో కృష్ణగౌడ్ తెలిపారు. కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 20న కుడిచింతల బావిలోని కృష్ణయ్య వ్యవసాయ పొలంలో అడవి జంతువుల వేటకు ఉచ్చులు వేశారు. కాగా ఉచ్చులో చిరుత పడడంతో హతమార్చి తర్వాత 18 గోర్లను, 4 దంతాలను సేకరించారు. వీటిని అమ్మకానికి కూడా పెట్టారని డీఎఫ్వో తెలిపారు. ఘటనకు సంబంధించి కుడిచింతల బావి గ్రామానికి చెందిన కృష్ణయ్య, లాలు, వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్డీవో శ్రీనివాసులు, ఎఫ్డీవో రోహిత్రెడ్డి, రేంజర్లు పాల్గొన్నారు.