నారాయణపేట, జనవరి 8 : సంక్రాంతి పండుగ సందర్భం గా ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని పేట ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పట్టణంలో ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పండుగను దృష్టి లో పెట్టుకొని చోరీలు జరుగుకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి వేళల్లో గస్తీని నిర్విరామంగా ఏర్పా టు చేస్తామన్నారు. కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదని, వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇంటికి తా ళం వేశాక డోర్ కర్టెన్ వేయాలని, విలువైన వస్తువుల సమాచారం, వ్యక్తిగత, ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీసులతో సమన్వయంగా సహకరిస్తేనే చో రీలను నియంత్రించవచ్చన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ను దగ్గర ఉంచుకోవాలని, దొంగతనాల నివారణకు స్వచ్ఛంద కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9492441100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సెలవుల కారణంగా ఇంటి వద్ద ఉండే పిల్లలు చెరువులు, బావుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని, పతంగులు ఎగురవేసే పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు.
విలువైన వస్తువులను బ్యాంకులో ఉంచాలి
కృష్ణ, జనవరి 8 : సంక్రాంతి పండుగకు వెళ్లేవాళ్లు వి లువైన బంగారం, నగదు వంటి వస్తువులు బ్యాంకుల్లో భ ద్రపర్చుకోవాలని ఎస్సై నాగరాజు అన్నారు. మండలకేంద్రంలోని స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేరని తాళాలు పగగోట్టి దొంగతనాలకు పాలుపడుతుంటారని, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాం కు ల్లో ఉంచుకోవాలని సూచించారు. దొంగలు రద్దీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని వృద్ధులు, మహిళల ఒంటిపై ఉన్న బంగారు అభరణాలు లాక్కెళ్లడం చేస్తుంటారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.
ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలి
కోస్గి, జనవరి 8 : కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, లేకుంటే రూ.1000 జరిమానా తప్పదని సీఐ జనార్దన్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆదివారం కోస్గిలో వారాంతపు సంత ఉంటుందని, మాస్కు లేకుండా తిరుగరాదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు తప్పక జాగ్రత్తలు పాటించాలన్నారు. బీరువా తాళాలను వెంట తీసుకెళ్లాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే చోరీలను నియంత్రించవచ్చన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.