చాదర్ఘాట్ : ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తిరుమల బ్యాంక్ చైర్మన్ నంగనూరి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మలక్పేటలోని తిరుమల బ్యాంక్లో జరిగిన కస్టమర్ మీట్లో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తిరుమల బ్యాంక్ ఆధ్వర్యంలో తిరుమలలో రెండు లడ్డూ ప్రసాదం కౌంటర్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
రెండు దశాబ్దాల క్రితం బ్యాంక్ను ప్రారంభించామని, ఖాతాదారుల ఆధరాభిమానాలతో బ్యాంక్ అభివృద్ధి చెందుతుంద న్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి.శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమలలో లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు తిరుమల తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ శోభనాద్రి, మేనేజర్ రవిశంకర్, బోర్డు డైరెక్టుర్లు తదితరులు పాల్గొన్నారు.