మక్తల్ రూరల్, జనవరి 8 : రైతుల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నో కష్టాల నుంచి అన్నదాతలను గట్టెక్కించడానికి సీఎం కేసీఆర్ ఎంతో దూర దృ ష్టితో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పంచలింగాలలో రైతుబంధు సంబురాలను శనివారం గ్రామస్తులు ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఉమ్మడి జిల్లా డీ సీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్యాల నిజాంపాషా హాజరయ్యారు. అంతకుముందు రైతులు ఎడ్ల బండ్లను రంగురంగులతో అ లంకరించి డప్పులతో స్వాగతం పలికారు. ఎద్దుల బండిపై ఎమ్మెల్యే చిట్టెం ఎక్కి కొంత దూరం నడిపించారు. పురవీధుల గండా ఊరేగింపు నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు రంగవల్లులు వేసి అందంగా ముస్తాబు చేశారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే, డీసీసీబీ, రైతులు క్షీరాభిషేకం చేశారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, రైతులకు పెట్టుబడి సహాయం అందించిన సీఎం కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ, జైజై తెలంగాణ, ఎమ్మె ల్యే నాయకత్వం వర్ధిల్లాలంటూ రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చే శారు. ఉత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వి ద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను అందచేశారు. గ్రా మంలో పండుగ వాతావరణం తలపించింది.
రైతుల కష్టాలుతీరాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నదాతల కష్టాలు తీరాయని, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శ పథకంగా నిలిచిందని ఎమ్మెల్యే చిట్టెం వెల్లడించారు. గ్రామంలో నిర్వహించిన రై తుబంధు వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ రైతుబం ధు పథకం దేశంలో ఇంతవరకు ఎక్కడ అమలు చేయలేద ని పేర్కొన్నారు. పథకానికి ఇప్పటి వరకు రూ.50 వేల కో ట్లు పెట్టుబడి సహాయంగా రైతుల ఖాతాలో జమ చే యడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల కళ్లల్లో అనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు రైతుల కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రై తును రాజును చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అ మలు చేస్తున్నామన్నారు. మరో పదేండ్లు సీఎంగా కేసీఆర్ ఉండాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, ఎంపీపీ వనజమ్మ, సర్పంచ్ తి క్కమ్మ, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
ఊట్కూర్, జనవరి 8 : సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమని కొల్లూరు సర్పంచ్ సరోజ, ఎంపీటీసీ విజయలక్ష్మి అన్నారు. శనివారం రైతుబంధు వేడుకలను ఘ నంగా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని కాడెద్దులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీ మా ట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీ ఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అ ధ్యక్షుడు జయప్రకాశ్రెడ్డి, గోపాల్రెడ్డి, ఎల్లప్ప, గో విందు, భీంరెడ్డి, భాస్కర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
గున్ముక్లలో ముగ్గ్గుల పోటీలు
ధన్వాడ, జనవరి 8 : రైతుబంధు సంబురాల్లో భాగంగా శనివారం మండలకేంద్రంలో ని గున్ముక్లలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. సీఎం కేసీఆర్, రైతుబంధు, రైతు బీ మాలపై రంగురంగుల ముగ్గులు వేశారు. ఇండ్ల వద్ద వేసిన ముగ్గులను టీఆర్ఎస్ నేత లు పరిశీలించారు. ఉత్తమ ముగ్గులను ఎం పిక చేసి బహుతులను ప్రదానం చేశారు. అ దేవిధంగా మంత్రోన్పల్లిలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుధీర్ కుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, టీఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు సచిన్, నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపూర్లో చిత్రపటాలకు క్షీరాభిషేకం
నారాయణపేట రూరల్, జనవరి 8 : మండలంలోని లక్ష్మీపూర్, ఊటకుంటతం డా, కొల్లంపల్లి తదితర గ్రామాల్లో రైతుబం ధు సంబురాలను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. లక్ష్మీపూర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, మంత్రులు కే టీఆర్, నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషే కం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రంగు రంగుల ముగ్గులు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామ్మోహన్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, ఎంపీటీసీ బాలమణి, ఉపసర్పంచ్ బాలప్ప, కో ఆర్డినేటర్ నర్సింహులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎలిగండ్లలో ముగ్గుల పోటీలు
మరికల్, జనవరి 8 : మండలంలోని ఇ బ్రహీంపట్నం, ఎలిగండ్ల గ్రామాల్లో రైతుబం ధు సంబురాలను రైతులు శనివారం ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ వచ్చాకే రైతుల కు న్యాయం జరిగిందని రైతులు పేర్కొన్నారు. ఎలిగండ్లలో రైతుబంధు ముగ్గులు వేసి సం బురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆ యా గ్రామాల సర్పంచులు దేవమ్మ, సుజా త, ఉపసర్పంచులు పాపిరెడ్డి, మోహన్, వ్య వసాయాధికారి శివకుమార్, నాయకులు, ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
నారాయణపేట, జనవరి 8 : దామరగిద్ద మండలంలోని ముస్తాపేట సర్పంచ్ లాలప్ప ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రై తుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించా రు. రైతులందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, విస్తర ణ అధికారి తదితరులు పాల్గొన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
నర్వ, జనవరి 8 : రైతు పక్షపాతి సీఎం కే సీఆర్ అని రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ చిన్నయ్య అన్నారు. మండలంలో ని లంకాల సర్పంచ్ ఉమరాయిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు రైతుబంధు వారోత్సవాలను ఘనం గా నిర్వహించారు. పురవీధుల గుండా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ శంకర్, నర్సింహ, విజయ్కుమార్, శ్రీకాంత్రెడ్డి, డీకే జనార్దన్, షఫీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.