సైదాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా సైదాబాద్ శంకేశ్వరబజార్ సాయిరాంనగర్లో ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూలేక పోవటంతో ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న నాగరాజు, లావణ్య దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో చిన్నారులిద్దరు పక్క ఇంట్లో హోం వర్క్ చేసుకుంటుండగా ఒక్కసారి ఇంటిగోడ పడిపోయింది.
దీంతో ఇంటి రేకులు, ఇతర వస్తువులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు సైదాబాద్ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించటంతో తాసీల్దార్ ప్రసాద్ రావు అదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.