వెంగళరావునగర్ : కరోనాను జయించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ కరోన మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రజల్లో కోవిడ్ టీకా పై ఉన్న సంశయనం క్రమంగా తొలగిపోతున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సౌకర్యార్ధం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేద ప్రజల ఆరోగ్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.కరోనాను రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతి పౌరుడికి టీకా అందజేయాలనే సంకల్పంతో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ యుసుఫ్గూడ సర్కిల్ ఉప కమిషనర్ రమేష్, వెంగళరావునగర్ డివిజన్ అధ్యక్షుడు కొనేరు అజయ్, వార్డు మెంబర్లు,టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.