వెంగళరావునగర్ : మహ్మద్ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ డివిజన్..ఎల్లారెడ్డిగూడ అలీనగర్ లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్ ఉన్ నబి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ముఖ్య అతిధిగా హాజరై ముస్లిం లకు శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త దాతృత్వం, కరుణ ధార్మిక చింతన, సర్వ మానవాళి ఐకమత్యాన్ని అకాంక్షించారని పేర్కొన్నారు. మానవాళిని ధర్మమార్గంలో, సత్యమార్గంలో నడుచుకునేలా ప్రవక్త ప్రభోధించారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హిందు, ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉంటున్నారని అన్నారు. అనంతరం మిలాద్ ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు తన్ను ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.