కాచిగూడ : తుల్జాపూర్ దేవాలయానికి వెళ్లిన వ్యాపారి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్ లింగంపల్లిలోని రాఘవేంద్రస్వామి దేవాలయ ప్రాంతానికి చెందిన అంకిత్జైన్ (34) వ్యాపారి. ఈ నెల 16 న ఉదయం తుల్జాపూర్ దేవాలయానికి దైవ దర్శనానికి వెళ్లి వస్తానని అంకిత్జైన్ ఇంట్లోంచి వెళ్లాడు.
ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు, భార్య స్నేహితుల ఇళ్లల్లో, తుల్జాపూర్లో వెతికినా ఆచూకి లభించకపోవడంతో భార్య అర్ఫన్దేవి గురువారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంట్లోంచి అంకిత్జైన్ వెళ్లే సమయంలో నీలి రంగు చొక్క, గొదుమ రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.