కందుకూరు : హైదరాబాద్ – శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని చేవేళ్ల ఎంపీ డాక్టరు గడ్డం రంజిత్రెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, జల్పల్లి మున్సిపాలిటి పరిధిలోని పహాడీషరీప్ నుండి,కందుకూరు, మహేశ్వరం తుక్కుగూడ మీదుగా ఉన్న ఈ జాతీయ రహదారిని విస్తరించక పోవడంతో అనేక ప్రమాదాలు జరుగున్నాయని, ప్రమాదాల నివారణ కోసం నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని ఆయన కోరారు.
రహదారిని విస్తరించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఎంపీ రంజిత్రెడ్డి సూచించిన విధంగా తక్షణమే నిధులు మంజూరు చేసి నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి తెలిపినట్లు ఆయన చెప్పా