కోడేరు, జనవరి 6 : వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళను కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తులు తెంచుకొని ద్విచక్ర వాహనంపై పారిపోతుండగా.. స్థానిక రైతులు, గ్రామస్తు లు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామ శివారు లో చోటు చేసుకున్నది. బాధితురాలి కథనం మేరకు.. తీగలపల్లి గ్రామానికి చెందిన దళిత ఎల్లమ్మ వారి పొలంలో కందికాయ కోయడానికి గురువారం ఉదయం 10 గం టల ప్రాంతంలో రోడ్డు వెంట వెళ్తున్నది. ఈ సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చి మాటువేసిన ఇద్దరు గు ర్తు తెలియని వ్యక్తులు ఎల్లమ్మ దగ్గరికి వెళ్లి కత్తితో బెదిరించారు. మెడలో ఉన్న పుస్తెలతాడును తెంచుకున్నారు. ఎ ల్లమ్మ కేకలు వేయడంతో సమీపంలోని గొర్రెల వద్ద ఉన్న గొల్ల పబ్బతి గంగయ్య పరుగెత్తుకుంటూ వచ్చి వారిని అ డ్డుకునే యత్నం చేశాడు. ఈ క్రమంలో దుండగలు రాయి తో కొట్టడంతో గంగయ్య తలపై గాయమై తీవ్ర రక్తస్రావమైంది. తర్వాత ఇద్దరూ బైక్పై వెళ్తుండగా అదే సమయం లో అనంతపురం గ్రామానికి చెందిన యాదగిరి అనే యు వకుడు ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చి చోరీ జరిగిన వి షయాన్ని గుర్తించి దొంగలను నిలువరించే ప్రయత్నం చే శాడు. ఈ క్రమంలో అతడిపై కూడా దొంగలు కత్తితో దా డి చేయగా యాదగిరికి గాయాలయ్యాయి. ఎల్లమ్మ పెద్దగా అరవడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి వచ్చి దొంగలను పట్టుకున్నారు. చోరీ విషయాన్ని తెలుసుకొని దుండగులను చెట్టుకు కట్టి చితకబాదారు. వారి వద్ద ఉన్న పుస్తెలతాడును ఎల్లమ్మకు ఇప్పించారు. అనంతరం కోడేరు పోలీసులకు సమాచారం అందించగా.. ఎస్సై కృష్ణ ఓబుల్రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని దొంగలను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఇద్దరూ పారిపోయారు. గాయపడిన గంగయ్యను దవాఖానకు తరలించారు. పెద్దకొత్తపల్లి మం డలం కల్వకోలు గ్రామానికి చెందిన వెంకటేశ్, గోపాల్ ఇ ద్దరూ తండ్రీ కొడుకులని, పదేండ్ల నుంచి వనపర్తిలో ఉం టున్నారని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.