ఉస్మానియా యూనివర్సిటీ : వచ్చే నెల 9వ తేదీన జరగనున్న తమ కుమార్తె తేజస్వి వివాహ వేడుకకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు మంగళవారం ఆహ్వానించారు.
రాజ్భవన్లో గవర్నర్ను కలిసి డిప్యూటీ మేయర్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ఆమెకు అందజేశారు.