బేగంపేట్ : నూతన సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్, బేగంపేట్ డివిజన్లకు చెందిన 40మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, సనత్నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీల చేతుల మీదుగ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ…ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహానికి లక్ష నూట పదహార్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెల ఆసరా పథకం కింద పెన్షన్లు, రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10వేలు రూపాయలను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు స్ఫూర్తితోనే పీఎం కిసాన్ సన్మాన్ యోజన కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్థార్ కృష్ణ, డిప్యూటీ తహసిల్థార్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.