ఆర్కేపురం : ఆది నుంచి ఉపాధ్యాయులకు సమాజంలో సముచిత స్థానం ఉందని లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి కార్యదర్శి కోట్ల రాంమోహన్ అన్నారు. మంగళవారం పటేల్గూడ ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకోని లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోట్ల రాంమోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే నిజమైన సమాజ నిర్మాతలని పేర్కొన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వెలుగు వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదన్నారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా బోధించడంలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి జోనల్ చైర్మన్ యాదయ్యగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.