రెంజల్/ చందూర్/ ఆర్మూర్, జనవరి 2: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పాలకులుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఏడేండ్ల కిందట వ్యవసాయం దండగ అన్నారొకరు.. ఇప్పుడు పండుగైంది. కరెంటు కష్టాలు.. బీడు భూములతో తల్లడిల్లిన తెలంగాణ రాష్ట్రమే నేడు అందరికీ ఉపాధి మార్గం చూపుతున్నది. గతంలో ఇక్కడి ప్రజలు ఇతర రాష్ర్టాలకు వలసపోగా.. ఏడేండ్ల నుంచి పుష్కలమైన నీటి వనరులు, అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలతో భూములన్నీ సస్యశ్యామలమవుతున్నాయి. దీంతో ఇతర రాష్ర్టాలకు చెందినవారు తెలంగాణకు వలస వస్తున్నారు. తమ రాష్ట్రంలో ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు లేవని, ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదని వలస కూలీలు వాపోతున్నారు. రెంజల్ మండలానికి వచ్చిన యూపీ కూలీలు కొందరు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల మిల్లర్లు, సీడ్ కంపెనీ యాజమాన్యాల ఒప్పందంతో వరి నాట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్, రెంజల్, నవీపేట, మాక్లూర్, చందూర్లో వరినాట్లు వేసేందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి కూలీలు వచ్చారు. రూ.4వేల నుంచి రూ.5వేలకు ఎకరం పొలంలో నాట్లు వేస్తున్నారు. పది మంది చొప్పున బృందాలుగా ఏర్పడిన మగ కూలీలు రోజుకు ఆరు నుంచి ఏడు ఎకరాల మేరకు వరి నాటుతున్నారు.
యూపీలో కష్టాలు.. కేంద్రం కొర్రీలతో ఇక్కడా ఉపాధికి దెబ్బ
ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారకపోవడంతో కష్టాలు అనుభవిస్తున్నామని ఉత్తరప్రదేశ్ కూలీలు చెబుతున్నారు. సొంత రాష్ట్రంలో వ్యవసాయం ఆశించిన స్థాయిలో లేక నాలుగు రాష్ర్టాలు దాటి ప్రతి ఏడాది మాదిరిగానే తెలంగాణకు వస్తున్నామని తెలిపారు. యాసంగిలో పండించే ధాన్యం కొనబోమని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ కూడా చాలా మంది రైతులు వరి పండించడం లేదని, దీంతో పనుల్లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర్ప్రదేశ్లో పాలన భిన్నంగా ఉందని, పలుకుబడి ఉన్న వారే లబ్ధిపొందుతున్నారని, కష్టాన్ని నమ్ముకున్న తమలాంటి కూలీలు పేదలుగానే మిగిలిపోతున్నామని మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతటా అమలైతే తమలాంటి వారి జీవితాలు మారే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో మాలాంటి వలస కూలీలకు చేతినిండా పనులు దొరకుతున్నాయని, దీంతో కుటుంబ పోషణ భారం కావడం లేదంటున్నారు.
తెలంగాణ సర్కార్ కిసాన్కే లియే బహుత్ కామ్ కర్రే..
తెలంగాణ సర్కార్ కిసాన్కే లియే బహుత్ అచ్చా కాం కర్రీ. హమారే పాస్ యోగి సర్కార్మే గరీబ్ బచ్నా ముష్కిల్ హోగయా. జిరాత్ కర్నెకే లియే యోగి సర్కార్ జంగల్ నై.. ఐసే హమారే జైసే ఆద్మీ కో దో ఎక్కర్ జమీన్దియేతో జిరాత్ కర్లేతే.. హరామ్ సే బచ్తే.
నామ్ బడా.. కామ్ చోటా హై
హమారే ఉత్తర్ప్రదేశ్మే యోగీనాథ్ సర్కార్కా బోల్ నేమే నాం బడాహై… సైరూప్మే కామ్ నై.. రైనేసి బచ్చోంకు గర్పే హి చోడ్కే చార్ ములుక్ చోడ్కే తెలంగాణకు నార్ లగానేకిలియే హర్ సాల్ ఆతే. తెలంగాణమే కాం జ్యాదా రైతా.. కాం కర్నేవాలే కం రైనేసి హర్సాల్ హమ్ ఆతే.
-వికాస్సింగ్, వలస కూలీ, ఉత్తర్ప్రదేశ్