సూర్యాపేట రూరల్ / హుజూర్నగర్ టౌన్ / కోదాడ రూరల్, డిసెంబర్ 10 : జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 402ఓట్లకు గాను 390ఓట్లు పోలయ్యాయి. ఎక్స్అఫిషియో ఓట్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి వినియోగించుకోగా ఎంపీ నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. జిల్లాకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. కరోనా దృష్ట్యా అధికారులు పోలింగ్ కేంద్రంలో కొవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 186మంది ఓటర్లు ఉండగా 183మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, సూర్యాపేట, తిరుమలగిరి మునిసిపల్ చైర్మన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్కల్ మండలంలో ఎంపీటీసీ, మద్దిరాల మండలంలో ఎంపీటీసీ, సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలోని స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు ఎక్స్అఫిషియోతో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 123ఓట్లకు గాను 118మంది ఓటు హక్కు వినియోగించుకోగా 95.93పోలింగ్ శాతం నమోదైంది. ఎంపీ ఉత్తమ్తో పాటు హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు చెందిన సీపీఎం కౌన్సిలర్లు త్రివేణి, సరిత, మేళ్లచెర్వు మండలం హేమ్లాతండా ఎంపీటీసీ టీకమ్, చింతలపాలెం మండలం ఎర్రగుంటతండా ఎంపీటీసీ భూక్యా బుల్లి ఓటంగ్కు దూరంగా ఉన్నారు. కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజవర్గవ్యాప్తంగా 93ఓటర్లకు గాను 89మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఓటింగ్ సరళిని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ రఘు అధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివ్వెంల తాసీల్దార్ రంగారావు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్కుమార్, తహసీల్దార్ జె.శ్రీనివాసశర్మ, పట్టణ సీఐలు నరసింహారావు, శివరాంరెడ్డి, రవి, ఎస్ఐలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికేదైనా గెలుపు టీఆర్ఎస్ దే : రమేశ్
మునగాల, డిసెంబర్ 10 : తెలంగాణలో ఎన్నికేదైనా గెలుపు టీఆర్ఎస్దేనని టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్ అన్నారు. శనివారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీటీసీలతో మాట్లాడి ఓటింగ్ సరళి తెలుసుకుని మాట్లాడారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందడం ఖాయమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్కు అండగా నిలుస్తున్నారని తెలియజేయడమంటే పార్టీ అభ్యర్థులు గెలుపొందడమే నిదర్శనమన్నారు. ఆయన వెంట ఎంపీటీసీలు మోహన్, ఇందిర, గన్నా భవాని ఉన్నారు.