రూ.93లక్షలతో నిర్మించిన నూతన మార్కెట్ ప్రారంభం
హఫీజ్పేట్ : ఎండనక, వాననక వీధుల్లో వ్యాపారం చేసుకొనే వీధివ్యాపారులకు రక్షణగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ హుడాకాలనీ రైల్వేస్టేషన్కు ఎదురుగా వీధివ్యాపారులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వ్యాపార సముదాయాన్ని కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్, మంజులారఘునాధ్రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గంలో ఐటీకారిడార్లో ఇదివరకే ఏర్పాటుచేసిన ప్రత్యేక వెండింగ్జోన్ల తరహలోనే పైలట్ప్రాజెక్టుగా హఫీజ్పేట్ డివిజన్ హుడాకాలనీలో మార్కెట్ను ఏర్పాటుచేశామన్నారు. దీంతో వీధి వ్యాపారులకు ఎండలు, వానల నుంచి రక్షణ కల్పించడంతోపాటు రోడ్డుపొడవునా నిత్యం ట్రాఫిక్తో ఇబ్బందులుపడే వాహనదారులకు ఉపశమనం కల్గనున్నదన్నారు.
విశాల సముదాయంలో సకలహంగులతో సుమారు 120 మంది వ్యాపారులు వినియోగించుకునేలా ఏర్పాటుచేసిన వసతులను వీధివ్యాపారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీకార్పొరేటర్ అశోక్గౌడ్, డివిజన్ అధ్యక్షులు గౌతంగౌడ్, రఘునాధ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు