మెహిదీపట్నం : శ్రీనిధి తెలంగాణ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్కు సంబంధించి కాకతీయ ద్వారం రూపంలో ఉన్న ట్రోఫిని తెలంగాణ పర్యాటక,సాంస్కృతి శాఖ కార్యదర్శి కె.ఎస్ .రాజు మంగళవారం హైదరాబాద్ గోల్ఫ్కోర్సులో ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 9 వరకు హైదరాబాద్ గోల్ఫ్కోర్సులో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హెచ్జీఎ కార్యదర్శి బివికె.రాజు. అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కోశాధికారులు అజయ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి జస్విందర్సింగ్ బిర్గి తదితరులు పాల్గొన్నారు.