చంపాపేట : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
శుక్రవారం భోగి పండగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేద పండితుల మంత్రోత్సవాలతో, భక్తి శ్రద్ధలతో అత్యంత కమణీయంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారిణి దీప్తీ రెడ్డి తెలిపారు.
కళ్యానోత్సవంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి ప్రసాదాలను అందజేసి, అనంతరం ఆలయంలో భక్తులందరికీ అన్న ప్రసాదాలను అందించారు. ఆలయ వేదపండితులు భార్గవ శర్మ, చంద్రకాంత్ శర్మ, పీతాంబరాచార్యులు, శంకర్ శర్మ, ప్రవీణ్ ఆచార్యులు, జిన్న సంతోష్ కుమార శర్మ, శ్రవణ్ కుమార్ శర్మ తదితరులు కళ్యాణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దీప్తీరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ ఈశ్వరమ్మ, డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్ కుమార్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ ధర్మకర్తలు చేగోని మల్లేశ్ గౌడ్, సామ రంగారెడ్డి, అఖిల మధుసాగర్, అనిత, రాజ్ గౌడ్, ఆలయ సిబ్బంది రాంబాబు, వేణుగోపాల్ సంతోష్, స్వామి, యాదగిరి, తదితరులు కళ్యాణం నిర్వహించారు. తదితరులు పాల్గొన్నారు.