బంజారాహిల్స్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజి గూడ, హిమాయత్నగర్ డివిజన్ల పరిధిలో పలు ఆలయాల్లో అమ్మవారు మహిషాసురమర్థని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఫిలింనగర్లోని వినాయక్నగర్, బసవతారకం నగర్, గాయత్రీ హిల్స్ తదితర ప్రాంతాల్లో దుర్గామాత మండపాల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు.