అంబర్పేట, కాచిగూడ : అంబర్పేట నియోజకవర్గంలో గల అన్ని పార్కులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం హార్టికల్చర్ విభాగం అధికారులతో కలిసి నల్లకుంట డివిజన్లోని మోతె నాగేశ్వరరావు పార్కు బర్కత్పురలోని హౌజింగ్బోర్డు పార్క్ను ఆయన సందర్శించారు.
పార్కులో చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పార్కుల సుందరీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే అన్ని పార్కుల్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వివిధ రకాల మొక్కలు నాటిస్తున్నట్లు చెప్పారు.
పార్కులో కాంపౌండ్ చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు, ఎంట్రెన్స్లో ఆర్చి నిర్మాణం, పాడైన బెంచ్ల స్థానంలో కొత్త బెంచీలు, కాంపౌండ్ వాల్పై అందమైన పెయింటింగ్స్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన మరుగుదొడ్లు, ఓపెన్ జిమ్ వసతులు కల్పించాలన్నారు. కాలనీవాసులకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్కులను పూర్తిస్థాయిలో అందంగా తీర్చిదిద్దాలని అధికారులకు చెప్పారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అడిషనల్ కమిషనర్ కృష్ణ, డీడీ శ్రీదేవి, డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ సంపత్, సూపర్వైజర్ శ్రీధర్, ఫయాజ్, కాలనీవాసులు మోత రోహిత్, మల్లిక్, లక్ష్మీనరసింహ, సునిత, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.