హిమాయత్నగర్ : కింగ్కోఠి, షేర్ఘాట్లోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం హిమాయత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేదానం నాగేందర్ను కలిసి వినతి పత్రాన్ని అంద జేశారు. దశాబ్ధాల క్రితం నిర్మించిన డ్రైనేజీ పైపులైన్ పాడవడంతో తరుచూ మురుగునీటి సమస్య వస్తుందని తెలిపారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో నూత నంగా రోడ్డు వేసేం దుకు నిధులు మంజూరు కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు పనులు ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారని, డ్రైనేజీ పనులు చేసిన తరువాత రోడ్డు వేయాలని స్థానికులు విన్నవించిన విషయాన్ని ఎమ్మెల్యే దానం దృష్టికి వీరు తీసుకు వచ్చారు.
తక్షణమే ఎమ్మె ల్యే దానం నాగేందర్ స్పందించి నారాయణగూడ జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేదానం నాగేందర్ కలిసిన వారిలో డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి, పి.ప్రభాకర్గౌడ్, మన్సూర్ ఉన్నారు.