రాజాపూర్, జనవరి 2: బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయే పడవలాంటివని, టీఆర్ఎస్ పుష్పక విమానమని ఎంత మంది వచ్చినా స్వాగతించి సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో దోండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శితోపాటు, ఆటో యూనియన్ సభ్యులు, ఖానాపూర్, కల్లేపల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండలంలోని 5మందికి బాధితులకు రూ.5లక్షల50వేల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సెజ్ బస్సు డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్,బీజేపీలు దేశాన్ని ఆగం చేసి, తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ప్రజలకు ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీజేపీ అంటే గతంలో విలువలతో ఉండేదని కానీ ఇప్పడు దొంగల పార్టీగా మారిందన్నారు. అధికారం కోసం ప్రజల మధ్యలో కులమతాల చిచ్చుపెట్టి రెచ్చగొడతారన్నారు. దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని, కాని తెలంగాణ ధాన్యం కొనమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత,నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల రమేశ్నాయక్, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, మార్కెట్ చైర్మన్ రఘువీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, నాయకులు నరహరి, మహిపాల్రెడ్డి, సత్యయ్య, యాదగిరి, ఆనంద్గౌడ్, అల్తాఫ్, పుల్లారెడ్డి పాల్గొన్నారు.