మియాపూర్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా….మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిత్య అభ్యసనతో ముగ్గులు వేయటం ఓ వ్యాయామంలా కూడా మహిళలకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవకర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదా ఫంక్షన్ హాల్లో సంక్రాంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్వర్లు , నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, అనీల్రెడ్డి, మహిళా నేతలు రాజ్యలక్ష్మీ,మధులత, శిరీష, మంజుల,బీబీ, స్వప్న, లావణ్య , స్వరూప,వరలక్ష్మీ, దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.