బంజారాహిల్స్ : దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ చేయూత అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతగా రైతుబంధు సంబురాలను నిర్వహిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 11లో మంగళవారం రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. రూ.50వేల కోట్ల రైతుబంధు సాయం అందించిన సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన పతంగులను ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సంక్రాంతి సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజతలు తెలిపేందుకు రైతుబంధు సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, ప్రేమ్కుమార్, శౌరీరాజు తదితరులు పాల్గొన్నారు.