చార్మినార్ : సబ్సిడీపై అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు అధిక ధరలకు నల్లబజారుకు తరలిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రేషన్ దుకాణాల నుండి అక్రమ పద్దతుల్లో నల్లబజారుకు తరలుతున్న పీడీ రైస్ను బుధవారం కామాటిపుర పోలీసులు గుర్తించారని ఇన్స్పెక్టర్ రాంబాబు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం పోలీప్ స్టేషన్ పరిధిలో ముందస్తు నేరాలను అదుపు చేసే క్రమంలో వాహనాల తనిఖీలను నిర్వహించామని తెలిపారు. అదే సమయంలో ఓ ఆటోలో క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యా న్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వాహనాన్ని నిలుపుదల చేశామని తెలిపారు.
ఆటోలో తరలిస్తున్న బియ్యానికి సంబంధించిన ధృవపత్రాల చూపించాలని కోరితే తడబడుతూ ఆటో డ్రైవర్ అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని, పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించా మని తెలిపారు.