సామాజిక మాధ్యమాలపై పోలీస్ నిఘా పెరిగింది. ఇకపై విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మతపరంగా కల్లోలం సృష్టించే మాటలు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే జైలుకే పర్యవేక్షణ కోసం జిల్లాకో మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశారు. అలాగే మహిళలను వేధించే వారిపై కూడా షీటీమ్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
నారాయణపేట టౌన్, జనవరి 7 : నారాయణపేట జిల్లాలో తె ల్లబంగారం మెరిసిపోతున్నది. మద్దతు ధర కంటే అధిక రేట్లకు వ్యాపారస్తులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్విం టాకు మద్దతు ధర రూ.6025 నిర్ణయించగా.. మార్కెట్లో శుక్రవారం రూ.9,600 ధర పలికింది. దీంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత వానకాలం సీజన్లో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. దాదాపు 7 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు. కానీ అధిక వర్షాలు కురువడం, తెగుళ్లు సోకడంతో కొంత మేర నష్టం వాటిల్లింది. అయినా రైతులకు మాత్రం సిరులు కురిపిస్తున్నది. ఈ సీజన్లో రైతులు ఆశించిన దాని కంటే ఎక్కువ ధర పలుకుతున్నది. ఇదిలా ఉండగా, గతేడాది జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు ఒ క్క మిల్లు మాత్రమే ఉండేది. దీంతో దామరగిద్ద, మద్దూర్ తదిత ర ప్రాంతాల రైతులు వికారాబాద్లో.., మరికల్, ధన్వాడకు చెం దిన కొంతమంది మహబూబ్నగర్లో పత్తి విక్రయించేవారు. పత్తి విక్రయించేందుకు వచ్చిన రైతులకు కూడా ఇబ్బందులు తలెత్తేవి. అయితే ఈ సారి కొత్తగా నాలుగు మిల్లుల ఏర్పాటుతో రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. 2020-21 ఏడాదిలో జిల్లాలో 27,066 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేయగా.. రూ.12,61,96,200 రైతులకు చెల్లించారు. వీటి ద్వారా సీసీఐ నుంచి రూ.12,61,962 మార్కెట్కు ఫీజు రూపంలో వచ్చింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 93,305 క్వింటాళ్ల పత్తిని రైతులు విక్రయించగా.. రూ.29,08,56,067 చెల్లించారు. రూ.29,08,560 మార్కెట్కు ఫీజు వచ్చింది.