రూ.300 ఒకసారి కడితే చాలు. లక్కీ డిప్ తీస్తాం.. తగిలితే రూ.10లక్షల విలువ చేసే కార్లు, ట్రాక్టర్లు, బంగారం, బైక్లు, దక్కుతాయంటూ ఊరిస్తారు..తక్కువ డబ్బులే కదా పోతేపోని అనుకుని చాలామంది ఆశతో చేరుతారు. మధ్య తరగతి, నిరుద్యోగ యువతే లక్ష్యంగా వేలాది మందితో స్కీం పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు.. ఈ దందా నాగర్కర్నూల్ జిల్లాలో విస్తృతంగా, బహిరంగంగా జరుగుతున్నది. వివాదాలకు, మోసాలకు కేరాఫ్గా నిలుస్తున్న ఈ స్కీంలు సామాన్యులను నట్టేటా ముంచుతున్నాయి.
ఆత్మకూరు, జనవరి 9: అవును నిజమే మీరు చూసింది..చదివింది.. ఎద్దుల పోటీలు, బండలాగుడు, కోళ్ల పందెలు, పొట్టేళ్ల పందెలు చూశాం..ఆఖరికి శునకాల పోటీలు చూసిఉంటారు..కానీ ఇక్కడ మాత్రం పిగ్ ఫైట్ నిర్వహించారు..అవును పందుల పోటీయే.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. ఈ ఏడాది పండుగ నేపథ్యంలో వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లలో నిర్వహించిన పందుల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ రకాల పందెలను చూసిన జనాలకు మొదటి సారిగా పందుల పోటీలు నిర్వహించగా పెద్ద ఎత్తున పోటీలను తిలకించేందుకు తరలివచ్చారు. పట్టణ శివార్లలోని మల్లాపురం ఆంజనేయస్వామి దేవాలయానికి సమీపంలో ఎన్టీఆర్ ఎడమ కాలువ పక్కన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన పోటీలకు ఉమ్మడి తెలుగు రాష్ర్టాల నుంచి పందులు వచ్చాయి. భారీస్థాయిలో వచ్చిన పందులు, పోటీలలో చేసిన విన్యాసాలను చూసి జనం అబ్బురపడ్డారు. ఆంధ్రా ప్రాంత నిర్వాహకులు మొదటి సారిగా భారీస్థాయిలో ఏర్పాటు చేసిన పందుల ఫైటింగ్లో బెట్టింగులూ జరిగినట్లు సమాచారం. మొత్తంగా పందుల ఫైటింగ్ను తిలకించడానికి వచ్చిన జనం మాత్రం ఉత్సాహంగా గడిపారు.