మణికొండ: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఆయన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేందర్రెడ్డికి శుభకాంక్షలు తెలిపిన వారిలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు జి.రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్, నార్సింగి మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్, పార్టీ సీనియర్ నాయకులు పత్తి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
వారంతా మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నార్సింగి, మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.