తలకొండపల్లి, డిసెంబర్ 8 : తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ నిర్మల, ఎంపీడీవో రాఘవులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల చివరిలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవులు, సర్పంచ్లు శ్యాంసుందర్రెడ్డి, రఘుపతి, ఎంపీటీసీ సోని, ధరణి, రాజేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నేడు వ్యాక్సినేషన్ పై ప్రత్యేక సమావేశం
ఆమనగల్లు/ ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 8 : మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కొవిడ్ వ్యాక్సినేషన్ పై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమనగల్లు ఎంపీడీవో వెంకట్రాములు, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహేశ్బాబు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వ్యాక్సిన్ రెండో డోస్ను వంద శాతం పూర్తి చేసే ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సమావేశంలో భాగంగా కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధానాలు, విద్యా సంస్థలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొవిడ్ నిబంధనల అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు.