మారేడ్పల్లి : ఆకలిగొన్న వారి వద్దకే వెళ్లి ఉచితంగా అన్న వితరణ చేయడం మానవీయతకు నిదర్శనం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. సికింద్రాబాద్ క్లాక్టవర్ పరిసర ప్రాంతాల్లో పలువురు పేదలకు సంకల్పం సంస్థ అధినేత ప్రొఫెసర్ రేఖారావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నవితరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వకుళాభవరం ముఖ్యఅతిధిగా హజరై ఆహార ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ…గడిచిన ఏడాదికాలంగా క్రమం తప్పకుండా సంకల్పం సంస్థ ఉచితంగా పోషక విలువలతో కూడిన భోజనం నగరంలో వివిధ ప్రాంతాల్లో వారంలో 2రోజులపాటు ఉచితంగా అందజేయడం అభినందించదగిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడ విశాల దృక్పథంతో రూ.5 లకే భోజన అందించడం ద్వారా వేలాది మంది ఆకలిని తీర్చగలగడం గొప్ప పరిణామం అని అన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను కలియ తిరుగుతూ ఎక్కడిక్కడ భోజనం వీధుల వెంబడి అన్నార్థులకు అందజేసే దిశగా సంకల్పం సంస్థ చేస్తున్న కృషి అమూల్యమైనదని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరుణ, ఇంటి పనివారుల సంఘం నాయకురాలు రాధిక తదితరులు పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ప్రాణహిత, రాహుల్, దుబాయ్కి చెందిన గీతాప్రసాద్ ఈ అన్నదాన కార్యక్రమాలకు దాతలుగా వ్యవహరిస్తున్నారు.