ప్రతి పాఠశాలకూ ‘భగీరథ’ నీళ్లు
విద్యార్థులకు తీరిన తాగునీటి గోస
అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలోనూ..
నెరవేరిన మిషన్ భగీరథ లక్ష్యం
ఇప్పటికే ఇంటింటికీ జలాలు
వేసవిలోనూ కానరాని నీటి కష్టాలు
నాగర్కర్నూల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ.. విద్యార్థుల పాలిట సు‘జలం’గా మారింది.ఇంటింటికీ శుద్ధజలం అందించే బృహత్తర పథకం విజయవంతంగా అమలవుతున్నది. మండు వేసవిలోనూ దాహార్తిని తీర్చింది. సాధారణ ప్రజలతోపాటు పాఠశాలల విద్యార్థులకూ ప్రయోజనం చేకూరింది. సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన ఈ పథకం వల్ల ప్రతి పాఠశాల, అంగన్వాడీ, హాస్టళ్లకు ఇప్పటికే నల్లా కనెక్షన్లు వంద శాతం పూర్తయ్యాయి. దీంతో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంస దక్కగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకూ తాగునీటి కష్టాలు తీరాయి.
నాగర్కర్నూల్, మార్చి 16 (నమస్తే తెలంగా ణ) : మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలోని మా రుమూల గ్రామాల్లో సైతం శుద్ధి చేసిన తాగునీరు సరఫరా అవుతున్నది. ఈ పథకం వల్ల పాఠశాలల విద్యార్థులకూ ప్రయోజనం చేకూరుతున్నది. ప్రతి పాఠశాల, అంగన్వాడీ, హాస్టళ్లకు వంద శాతం నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తా గునీటి కోసం రోడ్లెక్కడం.., మున్సిపల్, పంచాయతీ కార్యాలయాలు ముట్టడించడం, ఖాళీ బిం దెలతో నిరసనలు నిత్యకృత్యంగా ఉండేవి. అయి తే సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి మిషన్ భగీర థ పథకం అమల్లోకి వచ్చింది. దీంతో గత మూడు, నాలుగేండ్లుగా తాగునీటి సమస్య తీరిం ది. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కొన్ని పురపాలికల్లో కనెక్షన్లు ఇస్తున్నారు. ఈ పథకంలో భాగంగా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కస్తూర్బాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సైతం న ల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది.
ఇందుకుగానూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు కూడా దక్కాయి. గతంలో విద్యార్థులు తాగునీటి కోసం నానా పాట్లు పడేవారు. ఇంటి నుంచి బాటిళ్లలో తెచ్చుకున్న నీళ్లు సరిపోక తల్లడిల్లేవారు. ఇక పట్టణాల్లోని స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి హోటళ్లలో నీళ్లు తెచ్చుకునేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు తాగునీటి కష్టాలు తీరాయి. ఇప్పుడు ప్రతి పాఠశాల, హాస్టల్, కస్తూర్బా, గురుకులాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ఈ నీటిలో లవణాల శాతం తగిన మోతాదులో ఉండడంతో గుండె, రక్తనాళాల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని, కాల్షియం తగినంత ఉండటంతో ఎముకల పెరుగుదల సాఫీగా ఉంటుందని, మెగ్నీషియంతో జీవ రసాయన క్రియలు మెరుగ్గా పనిచేస్తాయని ఉపాధ్యాయులు, నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా నైట్రేట్ వల్ల నరాల సంకోచాల పనితీరు మెరుగవుతుందని, ఫ్లోరైడ్ ప్రభావం ఉం డదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల విద్యార్థుల్లో అం టువ్యాధుల ప్రాబల్యం తగ్గిందని చెప్పొచ్చు. నాగర్కర్నూల్ జిల్లాలో 786 ప్రభుత్వ పాఠశాలలు, 1055 అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు, గురుకులాలు కలిపి 137 సం స్థలు ఉండగా..ప్రైవేట్ భవనాల్లోని కొన్నింటికి మినహాయించి దాదాపుగా అన్నింటికీ నల్లా కనెక్ష న్లు ఇచ్చారు. తాగునీటి కష్టాలు తీరడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వతంగా సమస్య తీరింది..
నాగర్కర్నూల్ జిల్లాలోని 786 ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ నీటి కనెక్షన్లు ఇచ్చాం. గతంలో తాగునీటి కోసం విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. బోర్లు ఉన్నా ఉప్పునీళ్లు వచ్చేవి. దీంతో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు ఆ నీళ్లు తాగలేక.. తాగినా దప్పిక తీరక నానా కష్టాలు అనుభవించారు. నేడు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీళ్లు వస్తున్నాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది.
పనులు దాదాపుగా పూర్తి..
మిషన్ భగీరథతో తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. జిల్లాలోని 1,92,338 ఇండ్లకు వందశాతం నల్లా కనెక్షన్లు ఇచ్చాం. ప్రైవేట్ భవనాల్లోని కొన్నింటికి మినహాయించి దాదాపుగా వంద శాతం స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు కనెక్షన్లు ఇచ్చాం.