అమీర్పేట్ : పాశ్చాత్యపు ఆహారపుటలవాట్లు, శారీరక శ్రమ లేని ఆధునిక జీవన శైలి సకల అనారోగ్య సమస్యలకు కారణమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణావాసాల్లో కనీస సూర్య రశ్మికి కూడా చొరబడని నివాసాలు, కార్యాలయాలు కూడా ఆరోగ్య సమస్యలను పెంచి పోషిస్తున్నాయన్నారు.
యూఎస్ లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మూడు డయాగ్నస్టిక్ సెంటర్లు, పలు ఐటీ కంపెనీలను నిర్వహిస్తున్న సుధాకర్ కంచర్ల అమీర్పేట్ లాల్బంగళా సమీపంలో యోధా లైఫ్లైన్ పేరుతో పేరుతో ఏర్పాటు చేసిన నూతన డయాగ్నస్టిక్స్ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో.. పూర్తి వ్యాపారాత్మక ధోరణితోనే కాకుండా కొంత సేవా భావం కూడా కలిగి ఉంటే బాగుంటుందన్నారు. కోవిడ్ ఉదంతం ప్రజలకు ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తత పెంచిందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ చెస్ క్రీడాకారిణి హారికా ద్రోణవల్లితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.