మారేడ్పల్లి : మోండా డివిజన్ రైల్నిలయం అంబేద్కర్నగర్ బస్తీలోని షారోన్ (సిజిఎం) ప్రార్థనా మందిరాన్ని బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపక, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీగణేష్లు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ…కైస్తవుల సంక్షేమం, అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రార్థన మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ సి. జాన్ పాల్, చర్చి నిర్వాహాకులు స్టీవెన్, బ్రదర్ దాస్, ఫాస్టర్ బెనార్డ్ విజయరాజు, బాబురావు, బస్తీ నాయకులు రౌతు రాజయ్య, బాబయ్యయాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల హరికృష్ణ, టిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.