మైలార్దేవ్పల్లి : అప్పాచెరువు నిండినప్పుడల్లా వరద నీరు రోడ్డుపై పారుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్ గగన్ పహాడ్ లోని అప్పాచెరువును నేషనల్ హైవే అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చెరువు నుండి వచ్చే వరద నీటిని బ్రిడ్జి క్రింది నుండి వెళ్లేందుకు బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వర్షం వచ్చినప్పుడు అప్పా చెరువు పూర్తి స్థాయిలో నిండి వరద నీరు బెంగళూర్ హైవే రోడ్డుపై పారుతు వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
యుద్ధప్రతిపాదికన పనులు మొదలు పెట్టి మరోసారి వర్షానికి వరద నీరు రోడ్డుపై రాకుండా ఔట్ లేట్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.అలాగే గగన్ పహాడ్ ప్రధాన రహదారి పై బ్రిడ్జి నిర్మాణంలో ఉండడంతో స్థానిక ప్రజలు రోడ్డు దాటడానికి కష్టంగా ఉన్నందున అండర్ పాస్ వే నిర్మించాలని కోరారు. సందర్శించిన వారిలో నేషనల్ హైవే అధికారులు డీఈ ధర్మారెడ్డి, ఏఈ రంజిత్ తదితరులు ఉన్నారు.