అమీర్పేట్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు అశోక్యాదవ్ తల్లి పోచబోయిన కళావతి గురువారం మృతి చెందారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషాదంలో ఉన్న అశోక్యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అశోక్యాదవ్ను పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ అమీర్పేట్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, సంతోష్ మణికుమార్లతో పాటు పార్టీ నాయకులు కూతురు నర్సింహ, ఉమానాథ్గౌడ్ తదితరులున్నారు.