అమీర్పేట్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కాలేరు వెంకటేష, ముఠా గోపాల్, భేతి సుభాష్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మారావునగర్ ఇన్చార్జ్ గుర్రం పవన్కుమార్గౌడ్ ఏర్పాటు చేసిన భారీ కేక్ను మంత్రి తలసాని అభిమానులు, ఎమ్మెల్యేల సమక్షంలో కట్ చేశారు. అనంతరం వివిధ దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల నుండి విచ్చేసిన మత ప్రముఖులు మంత్రి తలసాని క్షేమాన్ని కోరుతూ ప్రార్ధనలు నిర్వహించి, ఆశీర్వచనాలు పలికారు.
అలరించిన తలసాని బయోపిక్…
మంత్రి తలసాని జీవిత విశేషాలను వివరిస్తూ బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందిన ‘మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బయోపిక్’ను జలవిహార్ ఎం.డీ రామరాజు ప్రారంభించారు. ఈ బయోపిక్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ జీవిత విశేషాలను ప్రదర్శించారు. అంతకు ముందు మంత్రి తలసాని జలవిహార్ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు.
పాల్గొన్న ప్రముఖులు
పశుసంవర్ధక వాఖ కమిషనర్ అనిత రాజేంద్ర, మత్య్సశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్గౌడ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్తో పాటు సినీ పరిశ్రమ నుండి ఆలిండియా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి సి.కళ్యాణ్, సంతోషం ఫిలిమ్ మ్యాగజిన్ ఎం.డీ. కొండేటి సురేష్, తెలంగాణ మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు సర్దార్ సురిందర్సింగ్, కార్పొరేటర్లు, కొలను లక్ష్మిరెడ్డి, మహేశ్వరి, హేమలతతో పాటు మాజీ కార్పొరేటర్లు ఎన్.శేషుకుమారి, అత్తెల్లి అరుణగౌడ్, ఆకుల రూపలతో పాటు నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు, పలువురు అధికార, అనధికార ప్రముఖులు మంత్రి తలసాని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.