బేగంపేట్ :బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాలో 22 కంపెనీలు పాల్గొని 700 మంది అభ్యర్ధులకు ప్లేస్మెంట్లు కల్పించాయి. ఈ మేళాలో బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధులతో పాటు అర్హులైన పట్టభద్రులు కూడా పాల్గొన్నారు.
700 మంది ఆన్లైన్లో, 1400 మంది ఆఫ్లైన్లో తమ పేర్లను రిజిస్టేషన్ చేయించుకున్నారు. 22 కంపెనీలు 50 మంది చొప్పున అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను మూడు రౌండ్లలో చేపట్టాయి. ఇందులో 4 ఐటీ కంపెనీలు, 7 ఫార్మా కంపెనీలు , టాటా, టెక్ మహేంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి అనేక కంపెనీలు తమకు కావలసిన అభ్యర్ధులను ఎంపిక చేసుకున్నాయి.
ఈ మేళా విజయవంతం చేయడంలో కళాశాల టీఎస్ కరేసీ విభాగం నుంచి డాక్టర్ శ్రీలత, ప్లేస్మెంట్ విభాగం నుంచి డాక్టర్ ప్రసన్న, కామర్స్ విభాగం నుంచి డాక్టర్ ప్రసన్న, డాక్టర్ రోహిణి, డాక్టర్ సుందరమూర్తిలతో పాటు 20 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తమ సేవలందించారు.