కొండాపూర్ : కొవిడ్ సోకిన గర్బిణీ మహిళ (36 నెలల)కు సాధారణ ప్రసవం చేసి తల్లీ,బిడ్డలను కాపాడారు హైటెక్సిటీ లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు. కరోనా సోకిన గర్భిణీల ప్రసవానికి పలు దవాఖానలు నిరాకరిస్తు న్న తరుణంలో సిజేరియన్కు వెళ్ళకుండా సాధారణ ప్రసవం చేసినట్లు కన్సల్టెంట్ అబెస్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీ లక్ష్మీ తెలిపారు.
36 వారాల గర్బిణీకి కొవిడ్ సోకడంతో డెలివరీ కోసం నగరంలోని ఓ దవాఖానకు వెళ్ళగా అప్పటికే మహిళ గర్భాశయ జలాలు విచ్చిన్నమయ్యాయని సిజేరియన్ చేయడం కష్టసాధ్యమని తిరిగి పంపించారు. దీంతో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానకు వచ్చిన గర్భిణీకి క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ ప్రసవం చేసి తల్లీ, బిడ్డలను కాపాడినట్లు డా.లక్ష్మీతెలిపారు.
కొవిడ్ను కారణంగా చూపి గర్భిణీలను వెనక్కి పంపడం బాధకరమైన విషయమని, కరోనా పరిస్థితులను బట్టి మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రసవాలు చేయవచ్చని తెలిపారు.