మెదక్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : భూమి కోసం, భుక్తి కోసం; బానిస బతుకుల విముక్తి కోసం రజాకార్లను, భూస్వాములను ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని సోమవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘ నంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాం ది పలికిన ధైర్యశాలి, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒకరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు.
జిల్లా కేంద్రంలోని వెల్కం బోర్డు వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.