మియాపూర్ : జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి ఇంఛార్జ్ జోనల్ కమిషనర్గా మమత నియామకమయ్యారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నుంచి శుక్రవారం లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం మమత కూకట్పల్లి జోనల్ కమిషనర్గా పని చేస్తుండగా….ఈ జోన్కు అదనపు బాధ్యతలను అప్పగించారు.
కాగా ఇప్పటి వరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అల ప్రియాంక ఈ నెల 27 నుంచి మూడు నెలల మెటర్నిటీ లీవ్లో వెళ్లారు. తిరిగి జులై 25 వ తేదీన ప్రియాంక తన విధులకు హాజరుకానున్నారు. శనివారం నుంచి శేరిలింగంపల్లి జోన్ పాలనా వ్యవహారాలపై దృష్టి పెడతానని ఇంఛార్జ్ జడ్సీ మమత తెలిపారు.