బండ్లగూడ : గండిపేట మండల పరిధిలోని హిమాయత్ సాగర్కు వరద నీరు పోటెత్తడంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.ఇటివల కురుస్తున్న వర్షాలతో ఎగువ ఉన్న చెరువులు,వాగులు నిండి హిమాయత్ సాగర్కు వరద నీరు వచ్చి చేరుతుంది.హిమాయత్ సాగర్ నీటి పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763అడుగులకు చేరుకుంది.
దీంతో జలమండలి అధికారులు మంగళవారం రెండు గేట్లను ఒక్క ఫీటు మేర ఎత్తి నీటిని ఈసీ నదిలోకి వదిలేస్తున్నారు. ఈసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని పలు విభాగాల అధికారులకు జలమండలి అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం.రామకృష్ణ, డీజీఎం.రేణుక. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, జలమండలి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..