అమీర్పేట: శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి వివేష పూజలు జరిగాయి. ఉదయం అభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పూలతో జరిగిన ఎల్లమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో బుధవారం డోనర్ సెల్ ప్రారంభం కానుంది.. దేవాలయ పాలక మండలి ఎక్స్ అఫిషియోగా అర్చకులు అనిల్కుమార్ బాధ్యతల స్వీకరించనున్నారు.