జూబ్లీహిల్స్ : బాస్కెట్బాల్ అకాడమీ నిర్వహించిన జిల్లాస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం జూబ్లీహిల్స్ అపోలో దవాఖానలో 26 జట్లు పాల్గొన్న బాస్కెట్బాల్ అండర్-18 బాలుర విభాగం పోటీలలో కెవిబిఆర్ క్రీడాకారులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బాలికలకు జరిగిన పోటీలలో కెవిబిఆర్ విద్యార్థినులు ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్-14 విభాగంలో నిర్వహించిన ఈ పోటీలలో నగరంలోని 24 జట్లు పాల్గొన్నాయి.
కోచ్ సొహైల్ నేతృత్వంలో శిక్షణ పొందిన కెవిబిఆర్ బాలబాలికలు ఈ పోటీలలో సత్తా చాటారు. బాలుర విభాగంలో శ్రవణ్, ప్రతీక్, విశ్వనాథ్, హేమంత్లు, బాలికల విభాగంలో అలీనా, మానియా, మారిక, విశాలి ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో విజేతలకు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ చైర్మెన్, తెలంగాణ బాస్కెట్బాల్ కార్యదర్శి నోర్మన్ ఇస్సాక్ బమతులు అందచేసి క్రీడాకారులను అభినందించారు.