మణికొండ : అమెరికన్ తెలుగు అసోసియేషన్తో కలిసి మే నెలలో నిర్వహించ తలపెట్టిన మెగా కన్వెన్షన్ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ను ముఖ్యఅథితిగా ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు కొణతం లక్ష్మణ్గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా మంగళవారం ప్రగతి భవన్లో ఆయన ఎంపీ సంతోష్కుమార్ను కలిసి తిరుపతి ప్రసాద వితరణతో పాటు మే నెలలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించతలపెట్టిన టీటీఏ మెగా కన్వెన్షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించినట్లు కొణతం లక్ష్మణ్గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిఏ అధ్యక్షుడు పటోళ్ల మోహన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు హరిందర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-పౌండర్ రాఘవ, నిర్వాహకులు పూర్ణచందర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.