పెద్దమందడి, జనవరి 3 : కరోనాపై నిర్లక్ష్యం వీడాలని, ప్రతిఒక్కరూ మాస్క్లు, శానిటైజర్ వాడాలని నాగర్కర్నూ ల్ ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. సోమవారం మం డల కేంద్రంలోని పీహెచ్సీలో వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జాగ్రత్తలతో ఒమిక్రాన్ను తరిమికొట్టొచ్చన్నారు. ఇప్పటికే 18 ఏం డ్లు పైబడిన వారందరికీ రెండో డోస్ టీకా పూర్తి కావచ్చిందన్నారు. తాజాగా 15 నుంచి 18 ఏండ్ల వారికి కూడా వ్యాక్సి న్ వేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించి టీకా వేయించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందూనాయక్, అదనపు కలెక్టర్లు వేణుగోపా ల్, ఆశిష్ సంగ్వాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, తాసిల్దార్ సునీత, ఎంపీడీవో అఫ్జల్, సర్పంచ్ వెంకటస్వామి, వైద్యుడు ఇస్మాయిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.