హిమాయత్నగర్ : గుట్టుచప్పుడు కాకుండా నిషేదిత గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తున్న పాన్దుకాణాలపై ఆదివారం నారాయణగూడ పోలీసులు దాడులు నిర్వ హించారు. సీఐ భూపతి గట్టుమల్లు ఆదేశాల మేరకు ఏఏస్సై సుబ్బారావు, పోలీస్ సిబ్బంది నారాయణగూడ, హిమాయత్నగర్లోని హోటల్లకు అనుబంధంగా ఉన్న పాన్షాప్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
అమ్మకానికి నిలువ ఉంచిన గుట్కా పాకెట్లు, పాన్మసాలా, ఇతర వస్తువుల మిశ్రమాలతో తయారు చేసిన పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. పాన్ దుకాణం నిర్వహకుడు సుధాకర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. గుట్కా,తంబాకు విక్రయించినా,రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.