శంషాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం (సీతారామచంద్రస్వామి) ఆలయ మరమత్తులు చేయడం కోసం దాతల సహారంతో పూర్తి చేస్తామని అందుకోసం అనుమతి ఇవ్వాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మపల్లి దేవాలయం గోపురం విరిగిపోయింది. మరమత్తులు చేయడం కోసం దాతల సహకారంతో పూర్తి చేస్తామని అందుకు దేవాదాయశాఖ అనుమతి ఇస్తే త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కమిషనర్ను కలిసిన వారిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీరటి రాజు ముదిరాజ్, ఆలయధర్మకర్తలు శ్రీనివాస్, నీరటి ఆశోక్, నీరటి కృష్ణ తదితరులు ఉన్నారు.