కాచిగూడ : నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గాంధీ మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు పద్మ డిపిరెడ్డి, జానేశ్వర్గౌడ్, నాయకులు శ్రీరాములు ముదిరాజ్, డాక్టర్ సులోచన, మిరియాల రవీందర్, సత్యనగర్ బస్తీవాసులు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతంరావు, వనం రమేశ్, కోశబోయిన శ్రీధర్, చిట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.