ఎల్బీనగర్ : దిల్సుఖ్నగర్లోని శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆలయంలో ఆదివారం దివ్యాంగుల జంటకు వివాహం జరిపించారు. తెలంగాణ ప్రాంతీయ దివ్యాంగుల సంఘం వారి అభ్యర్ధన మేరకు దివ్యాంగులైన వధువరులు కల్యాణం కవిత, మోడెం ప్రసాద్ గౌడ్లకు సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో వివాహం జరిపించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ హజరై వదూవరులను ఆశీర్వదించారు. వివాహానికి హజరైన బంధు మిత్రులకు ఆలయ కమిటీ వారు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఛైర్మన్ బచ్చు గంగాధర్, సంయుక్త కార్యదర్శి పద్మాకర్ ఆత్రే, కార్యవర్గ సభ్యులు ఎం. శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.